News April 2, 2025

పెద్దపల్లి: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న 4గురు మృతిచెందారు. సుల్తానాబాద్(M) పూసాలకు చెందిన N.లింగమూర్తి(39) పెళ్లి కావట్లేదని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయంతి(25)అనే యువతి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగాధర(M)కురిక్యాలకు చెందిన O.ప్రశాంత్(40) <<15959874>>కరెంటుషాక్‌<<>>తో చనిపోయాడు. JGTLరూరల్(M) నర్సింగాపూర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.

Similar News

News December 9, 2025

ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

image

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.

News December 9, 2025

జగిత్యాల: నేటితో ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..!

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాలలో నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంది. ఇప్పటికే మందు, విందులతో జోరుగా దావతులు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి పలువురు అభ్యర్థులు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.