News February 25, 2025
పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం, గోదావరిఖని, మంథని, రామగిరి, 8ఇంక్లైన్ కాలనీ ఏరియాల్లో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News October 24, 2025
గ్రేటర్ తిరుపతి పై కౌన్సిల్ లో రచ్చ

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే గ్రేటర్ తిరుపతి పై చర్చ రచ్చగా ప్రారంభమైంది. మేయర్ శిరీష ప్రతిపాదన పెట్టగానే డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ప్రతిపాదన ఇప్పటిది కాదని సీఎం కు కృతజ్ఞతలతో ఆమోదం తెలపాలని కోరగా.. వైసీపీ నాయకులు గ్రేటర్ తిరుపతి నినాదాలు, ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
News October 24, 2025
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన విశాఖ కలెక్టర్

చినగదిలిలో ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News October 24, 2025
ఏటూరునాగారం: రోడ్లపై ఆహారం.. బలౌతున్న కోతులు!

ఏటూరునాగారం-పస్రా మధ్య జాతీయ రహదారిపై కోతులు మృత్యువాత పడుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రతిరోజు వాహనాల వేగానికి బలౌతున్నాయి. వాహనదారులు రోడ్లపై పడవేసే ఆహారం కోసం వెళ్లే క్రమంలో వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. అడవుల్లో ఆహారం లభించక రోడ్లపై వాహనదారులు వేసే ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లపై ఆహారం వేయొద్దని చెప్పిన పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు వాపోతున్నారు.


