News February 12, 2025
పెద్దపల్లి: ‘స్థానిక సంస్థల గత రిజర్వేషన్లు ఓసారి చూడండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739285327534_51751241-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల కంటే ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రచారం సాగుతుంది. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో UR-7, BC-3, SC-3 రిజర్వేషన్లు కేటాయించారు. అందులో మహిళా-7, జనరల్-6 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని ఆశావాహులు వారి మండలానికి తమకు అనుకూలంగా జడ్పీటీసీ రిజర్వేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739336837733_51150652-normal-WIFI.webp)
కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2025
గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334871034_60415181-normal-WIFI.webp)
గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.
News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334636421_1047-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.