News March 10, 2025
పెద్దపల్లి: 10వ తరగతి పరీక్షల నిర్వహణపై DEO సమీక్ష

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, DEO మాధవి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలన్నారు. జిల్లాలో పరీక్షల కోసం 41 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.
Similar News
News November 27, 2025
బోధన్: 13 నెలల చిన్నారిని చిదిమేసిన ఆటో

సాలూరు మండలం సాలంపాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి ఆటోలో వచ్చిన వ్యక్తి అజాగ్రత్తగా నడిపి గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇర్ఫాన్, అయోష బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ బోధన్కు చెందిన అబ్దుల్ ఖాదర్గా గుర్తించారు.
News November 27, 2025
వరంగల్: అక్ర‘మార్కులు’ కలిపిన ఆ పెద్దాయన ఎవరు..?

డబ్బులిస్తే ఫెయిల్ ఐనవారిని పాస్ చేయడం కొన్ని విద్యా సంస్థల్లో నిత్యంజరిగే వ్యవహారం. మనుషుల ప్రాణాలను కాపాడే ప్రాణదాతల విషయంలో సబ్జెక్టు లేకపోతే శంకర్ దాదా లాంటి డాక్టర్లు అవుతారు. ఈ లాజిక్ను మరిచిన ఓ పెద్దాయన లాగిన్లోనే ఈ అక్ర‘మార్కుల’ తంతు జరగడం కలకలం రేపుతోంది. అక్రమార్కులకు కేంద్రంగా మారిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీని ప్రక్షాళన చేయాలి. ఇంటిదొంగను కాపాడేందుకు ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
News November 27, 2025
సిద్దిపేట: యువకుడి సూసైడ్.. ముగ్గురిపై కేసు

ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్గల్ మం. అంబర్పేట వాసి పవన్ కళ్యాణ్(21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఇంటికి వెళ్లిన పవన్పై యువతి తండ్రి శ్రీనివాస్, మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈనెల 25 మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురిని రిమాండ్ చేశారు.


