News March 2, 2025

పెద్దపల్లి: 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 100% గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1930 మంది క్రమబద్దీకరణ లేని స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25శాతం రాయితీ లభిస్తుందన్నారు. PSలు, MPOలు, DPOలు మోటివేట్ చేస్తూ పేమెంట్ అయ్యేలా చూడాలన్నారు.

Similar News

News January 11, 2026

వెల్లంపల్లి హైవేపై ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

image

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News January 11, 2026

రోజుకు ఎన్ని నీళ్లు తాగాలంటే?

image

మీరు రోజూ తాగాల్సిన నీటి పరిమాణం మీ బరువు, వాతావరణం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అయితే, రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే.. పై లక్షణాలు రెగ్యులర్‌గా కనపడితే అప్రమత్తం అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు.

News January 11, 2026

పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్సీ నాగబాబు

image

పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల రెండో రోజు వేడుకల్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇచ్చింది పిఠాపురం ప్రజలేనని కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపునకు కారకులైన నియోజకవర్గ ప్రజలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ వేడుకలు స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.