News March 2, 2025

పెద్దపల్లి: 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 100% గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1930 మంది క్రమబద్దీకరణ లేని స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25శాతం రాయితీ లభిస్తుందన్నారు. PSలు, MPOలు, DPOలు మోటివేట్ చేస్తూ పేమెంట్ అయ్యేలా చూడాలన్నారు.

Similar News

News March 23, 2025

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్‌లెస్ కేజీ రూ.180-200 ఉండగా.. విత్ స్కిన్ కేజీ రూ.150-170 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.130-150 మధ్య ఉంది. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గతనెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా ప్రస్తుతం అమ్మకాలు పెరిగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో కోళ్ల మరణాల ఎక్కువ కావడంతో రేటు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

News March 23, 2025

సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు.  సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News March 23, 2025

నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

image

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.

error: Content is protected !!