News March 17, 2025
పెద్దపల్లి: 196 మంది విద్యార్థుల గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు 5,500 మంది హాజరు కావాల్సి ఉండగా 5,304 మంది హాజరు కాగా..196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News November 28, 2025
‘అమరావతిలో పరిష్కారమైన లంక భూముల సమస్య’

రాజధాని ల్యాండ్ పూలింగ్కు లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.
News November 28, 2025
అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News November 28, 2025
NLG: లావాదేవీలు జరగని డబ్బు.. తీసుకునేందుకు అవకాశం

జిల్లాలో ఆయా బ్యాంకుల్లో లావాదేవీలు జరగని డబ్బు వివిధ ఖాతాల్లో రూ.2.04 కోట్లు ఉంది. ఖాతాదారులు మృతిచెందడం, నామిని వివరాలు లేకపోవడం, డబ్బులు డిపాజిట్ చేసిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం తదితర కారణాలతోపాటు బ్యాంకుల్లో డబ్బు ఎక్కడికి పోతాయనే ధీమాతో డబ్బును అలాగే ఉంచుతున్నారు. బ్యాంకు వారిని కలిసి మొత్తాన్ని తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అవకాశం కల్పించింది.


