News March 17, 2025

పెద్దపల్లి: 196 మంది విద్యార్థుల గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు 5,500 మంది హాజరు కావాల్సి ఉండగా 5,304 మంది హాజరు కాగా..196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News January 11, 2026

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పోలీసులు చైనా మాంజా విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, స్టేషనరీ షాపులను తనిఖీ చేసిన అధికారులు.. నిషేధిత నైలాన్ మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మాంజా పక్షులకు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. సంక్రాంతి వేళ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

News January 11, 2026

నారాయణపురం: 57 ఏళ్లు.. 18 పట్టాలు

image

మండలానికి చెందిన ఇమ్మడి నాగేష్ అక్షరాలతోనే సహవాసం చేస్తూ అనేక కోర్సుల్లో 18 పట్టాలు సాధించారు. సొంత ఊర్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన నాగేష్ ఇటీవల 57 ఏళ్ల వయసులో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి యోగాలో డిప్లొమా కోర్సు చేసి పట్టా స్వీకరించారు. తన ఊరిలో ‘గ్రామ శ్రీ’ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య శిబిరాలతో పాటు విద్యార్థులకు తీర్థ వికాస శిక్షణాసేవా వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News January 11, 2026

YouTubeపై వియత్నాం కొత్త రూల్.. 5 సెకన్ల తర్వాత స్కిప్ ఉండాల్సిందే!

image

YouTube వీడియోలు చూడాలంటే యాడ్స్ చిరాకు తెప్పిస్తాయి. అయితే వియత్నాం ప్రభుత్వం యాడ్స్‌పై పరిమితులు విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ప్రతి వీడియోలో యాడ్ స్టార్ట్ అయిన 5 సెకన్లకు స్కిప్ ఆప్షన్ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో బలవంతంగా యాడ్స్ చూడాల్సిన బాధ తప్పుతుంది. ఇన్‌స్టా, టిక్‌టాక్‌కూ ఈ రూల్ వర్తించనుంది. FEB 15 నుంచి కొత్త విధానం అమలు కానుంది. మన దగ్గరా ఇలా చేయాల్సిందేనా? COMMENT?