News March 17, 2025

పెద్దపల్లి: 196 మంది విద్యార్థుల గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు 5,500 మంది హాజరు కావాల్సి ఉండగా 5,304 మంది హాజరు కాగా..196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 18, 2025

HYD: దుకాణం.. అగ్ని ప్రమాదానికి ఆహ్వానం!

image

కిరాణా దుకాణాలు ప్రమాదపు బాంబులుగా మారాయి. అగ్ని ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఘట్‌కేసర్ మండల పరిధిలో షాపుల్లోనే అక్రమంగా పెట్రోల్ అమ్ముతున్నారు. పెట్రోలియం ఆక్ట్, 1934 ప్రకారం ఇది తీవ్ర నేరం. కఠిన శిక్షలు విధించాలి. కానీ, అధికారుల నిద్రమత్తుతో ఈ దందా బహిరంగంగా సాగుతోంది. చిన్న అగ్ని ప్రమాదమే పెను విషాదంగా మారనుంది. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News March 18, 2025

NLG: టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

News March 18, 2025

టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

image

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.

error: Content is protected !!