News February 4, 2025
పెద్దపల్లి: 2 లక్షలకుపైగా విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు: కలెక్టర్

19 ఏళ్లలోపు ప్రతిఒక్కరికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సూచించారు. ఈనెల 10 నుంచి 17 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీలలో 2 లక్షలకుపైగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్న 5,547 మంది భక్తులు

వేములవాడ రాజన్న క్షేత్రంలో సోమవారం నాడు 5,547 మంది భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు భీమేశ్వరాలయం రద్దీగా మారింది. శ్రీ స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో 94 జంటలు పాల్గొన్నాయి. వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొని తరించారు.
News November 24, 2025
లెక్చరర్ వేధింపులు.. కారేపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి ఇంగ్లిష్ లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లేందుకు అనుమతి అడిగినందుకు అధ్యాపకుడు దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపం చెంది లారీ కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆ అధ్యాపకుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన నూతన డీసీపీ

పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ చర్యలు, పోలీసింగ్ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నూతనంగా నియమితులైన డీసీపీ సోమవారం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల వారీగా నేర గణాంకాలు, భద్రతా చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా సేవల అమలు విధానాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు.


