News February 4, 2025

పెద్దపల్లి: 2 లక్షలకుపైగా విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు: కలెక్టర్

image

19 ఏళ్లలోపు ప్రతిఒక్కరికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సూచించారు. ఈనెల 10 నుంచి 17 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీలలో 2 లక్షలకుపైగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

image

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.

News October 16, 2025

MNCL: భర్త వేధింపులు భరించలేకనే..!

image

నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ ప్రస్థానంలో కొనసాగిన 60 మంది మావోయిస్టులు బుధవారం గడ్చిరోలిలో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. వారిలో మంచిర్యాల(D) బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ ఉన్నారు. ఆమె పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. తల్లిదండ్రులు సరోజకు 15 ఏళ్ల ప్రాయంలో వివాహం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఉద్యమానికి ఆకర్షితురాలై పోరుమార్గాన్ని ఎంచుకున్నారు.

News October 16, 2025

జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.