News March 7, 2025

పెద్దపల్లి: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

image

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 26, 2026

HYD: అడవిలో ఒక రాత్రి.. ఈ ఆదివారం క్యాంప్!

image

ప్రకృతి ప్రేమికులకు మంచిరేవుల పార్క్ అదిరిపోయే ఆఫర్. ​వీకెండ్‌లో కాంక్రీట్ జంగిల్ వదిలి అసలైన అడవిలోకి వెళ్లాలనుందా? మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఈ నెల 28న రాక్ బే నేచర్ క్యాంప్ ఉంది. నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో పాటు మార్చి 1న ఉదయం ‘బర్డ్ వాక్’ సందడి ఉంటుంది. నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు. రూ.1199(పిల్లలు), రూ.1999 (పెద్దలు). బర్డ్ వాక్ ఫీజు రూ.450 మాత్రమే.

News February 26, 2026

TG ప్రభుత్వానికి విద్యాకమిషన్ ప్రతిపాదనలు

image

* బోధనా మాధ్యమంగా ఇంగ్లిష్. త్రిభాషా విధానం(తెలుగు/ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ) ఒకటో తరగతి నుంచే అమలు.
* SSC, ఇంట‌ర్ బోర్డులు విలీనం చేసి, 12వ త‌ర‌గ‌తిలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వ‌హించాలి. కనీస ఉత్తీర్ణ‌త శాతాన్ని 45కు పెంచాలి.
* EAPCET ర‌ద్దు చేసి ఇంజినీరింగ్‌, వ్య‌వ‌సాయం, ఫార్మ‌సీ ప్ర‌వేశాలు 12వ త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా కేటాయించాలి.
* IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నియంత్రణకు చట్ట సవరణ చేయాలి.

News February 26, 2026

నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.