News December 5, 2024

పెద్దపల్లి: 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో

image

పెద్దపల్లి జిల్లా ప్రజల చిరకాల కోరిక బస్సు డిపో ఏర్పాటు తీరింది. పెద్దపల్లి పట్టణంలో 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అభిమాన నాయకుడు విజ్జన్న నిరంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని, ఆయన శాసనసభ్యుడిగా గెలవడం వల్లనే ఈరోజు పెద్దపల్లికి బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నాలుగు పోలీస్ స్టేషన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు.

Similar News

News December 16, 2025

కరీంనగర్: 454 మందికి రేపు అగ్ని పరీక్ష

image

కరీంనగర్ జిల్లాలో మూడో దఫా గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 108 గ్రామాలలో 454 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీపడుతున్నారు. హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 108 సర్పంచ్, 1034 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు మండలాలలో 1,59,647 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.