News February 18, 2025

పెద్దపల్లి: HYD సింగరేణి భవన్ వద్ద నిరసనకు సిద్ధం..!

image

సింగరేణి కార్మికుల విజిలెన్స్ పెండింగ్ కేసులు సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యారు. సింగరేణి మారు పేర్ల సమస్యల పరిష్కారం కోసం 150 మంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. “మా ఉద్యోగాలు మాకు కావాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Similar News

News March 24, 2025

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ

image

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ రవీందర్ ఎంపికయ్యాడు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 130 మంది పాల్గొనగా భైంసా ఇలేగాం వాసి అయిన రవీందర్ పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. యోగా అసోసియేషన్ ఛైర్మన్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

News March 24, 2025

మార్చి 24: చరిత్రలో ఈరోజు

image

1603 : బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775 : కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977 : భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2025

MHBD: బెట్టింగ్‌తో జీవితాలు చిత్తు: ఎస్పీ

image

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోల్కోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు ఈ మ్యాచులు ప్రారంభమయ్యాక తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

error: Content is protected !!