News February 26, 2026
పెద్దపల్లి: TASK ద్వారా ఉచిత శిక్షణ, ప్లేస్మెంట్

PDPL నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ప్లేస్మెంట్ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-2026లో డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్ పూర్తిచేసిన వారు అర్హులు. FEB 25-28 వరకు నమోదు, MAR 2-22 వరకు శిక్షణ ఉంటుంది. మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆసక్తి గల వారు TASK సెంటర్, PDPLలో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 18, 2026
గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

గూగుల్, మెటా, X, యూట్యూబ్కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.
News April 18, 2026
రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.
News April 18, 2026
లోక్సభ నిరవధిక వాయిదా

లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.


