News December 17, 2024
పెద్దపులి సంచారం కలకలం

కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు రైతులు అధికారులకు తెలిపారు. దీంతో వారు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు వెళ్లిందో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.
Similar News
News November 20, 2025
ఖమ్మంలో 8 మిల్లులకు ధాన్యం ఇవ్వబోం: అ.కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 71మిల్లుల్లో 63మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని, మిగిలిన 8మిల్లులకు ధాన్యం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేసిన తర్వాతే కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


