News February 9, 2025
పెద్దమందడి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేగారెడ్డి కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రికి ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను విడతలవారీగా అమలు చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News October 27, 2025
భారత్తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

వచ్చే నెలలో భారత్తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.
News October 27, 2025
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. సోమవారం అమలాపురం పోలీసు కార్యాలయంలో ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలకు సంబంధించిన వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.
News October 27, 2025
పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


