News April 20, 2025

పెద్దముడియం: పిడుగు పడి యువకుడు మృతి

image

పెద్దముడియం మండలం చిన్నముడియంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) మృతి చెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతి చెందాడు. మృతుడు S.ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 21, 2025

సమస్యలు ఉంటే తెలపండి: కడప కలెక్టర్

image

రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ వాటిపై నేరుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు డయల్ యువర్ కలెక్టర్ ద్వారా 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చన్నారు.

News April 20, 2025

వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

image

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను http://convocation.yvuexams.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

News April 20, 2025

ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

image

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి. 

error: Content is protected !!