News March 25, 2024
పెద్దశంకరంపేట: నీట మునిగి గొర్రెల కాపరి మృతి

పెద్ద శంకరంపేట మండలం కొప్పల్ శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో నీట మునిగి గొర్రెల కాపరి చౌదరిపల్లి రాజు(32) మృతి చెందాడు. నాగల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన రాజు గొర్రెలు మేపడానికి నిన్న నిజాంసాగర్ వైపు వచ్చాడు. బ్యాక్ నీళ్లలో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యాడు. ఈరోజు మృతుడి శవాన్ని బయటకు తీయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 18, 2025
పోలింగ్లో మెదక్ జిల్లాకు 5వ స్థానం

జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.37 శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా ముగించడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పాత్రికేయులకు అభినందనలు తెలియజేశారు.
News December 18, 2025
మెదక్: ఎన్నికల అధికారిని సన్మానించిన కలెక్టర్

మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన మూడు విడతల స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారి జుల్ఫెక్వార్ అలీని శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికను అందచేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించి, ఎన్నికలు విజయవంతం చేసిన జుల్ఫెక్వార్ అలీని కలెక్టర్ అభినందించారు.
News December 18, 2025
మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


