News April 5, 2024
పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం
తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు పెద్దశేషవాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News January 20, 2025
చిత్తూరు జిల్లాలో తెరుచుకున్న స్కూళ్లు
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. వారం నుంచి ఇంటి వద్ద సంతోషంగా గడిపిన చిన్నారులు స్కూళ్లకు బయలుదేరారు. స్నేహితులతో ఆటలు, అమ్మచేతి కమ్మని వంట, బంధువుల ఆప్యాయత మధ్య గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ స్కూళ్లకు వెళ్లారు. పలువురు ‘అమ్మా.. ఇవాళ నాకు కడుపు నొప్పి.. నేను బడికి వెళ్లను అంటూ మారం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. మీరు ఇలానే చేశారా?
News January 20, 2025
చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు
చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ఉన్న మధుబాలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ ఛైర్మన్లను నియమించారు. అయితే ఇవి నామినేటెడ్ పోస్టుల కావడంతో కొందరు ప్రభుత్వం మారిన కొనసాగుతున్నారు. దీంతో వారిని తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
News January 19, 2025
చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా
ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.