News February 9, 2025
పెద్దాపురంలో డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పెద్దాపురంలో డివైడర్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి పెద్దాపురం దర్గా సెంటర్ సమీపంలో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు పెద్దాపురంలో ప్రమాదవశాత్తు డివైడర్ మీదకు వెళ్లింది. దీనితో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనతో అక్కడ వాహనాలు నిలిచిపోయి, భారీ ట్రాఫిక్ ఏర్పడింది.
Similar News
News November 20, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News November 20, 2025
HYD: ఓయూలో “రిక్రూట్మెంట్ డ్రైవ్”

ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (HCDC) ఆధ్వర్యంలో సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ కోసం కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను CFRD భవనంలోని e-క్లాస్రూమ్ క్యాంపస్లో నిర్వహించారు. OUకి చెందిన ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) ప్రత్యేకతల విద్యార్థులకు మాత్రమే నిర్వహించారు. మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
News November 20, 2025
చలికాలం స్నానం చేయడం లేదా?

చలి విపరీతంగా పెరగడంతో చాలామంది స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఎంత వేడినీటితో షవర్ చేసినా తర్వాత చలివేస్తుందంటూ స్నానానికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే రోజుల తరబడి స్నానం చేయడంలేదు. అయితే ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారి తీస్తుందట. అలాగే చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి.


