News November 13, 2024

పెద్దాపురం: కిడ్నాపర్ నుంచి బాలికను రక్షించిన పోలీసులు

image

పెద్దాపురం పరదేశమ్మ కాలనీ వద్ద కిడ్నాపర్ నుంచి ఓ బాలికను పెద్దాపురం పోలీసులు బుధవారం తెల్లవారుజామున రక్షించారు. ఇటీవల HYD మియాపూర్‌లో కిడ్నాప్ చేసి పెద్దాపురం పరదేశమ్మ పేటలో బాలికను నిర్బంధించినట్లు ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశామన్నారు. కొత్త ఆనంద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, ఘటనపై డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News April 15, 2026

ఈనెల 17న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

News April 15, 2026

ఈనెల 17న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో తూ.గో జిల్లా సత్తా..!

image

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.