News July 28, 2024
పెద్దాపురం: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పెద్దాపురం జవహార్ నవోదయ విద్యాలయం (2025-2026)లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పెద్దాపురం విద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని 43 మండలాల నుంచి ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు అర్హులన్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 18న పరీక్ష జరుగుతాయన్నారు.
Similar News
News November 21, 2025
తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
News November 20, 2025
మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

శానిటేషన్ IVRS కాలింగ్లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.
News November 19, 2025
ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.


