News March 13, 2025
పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.R పల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్ట్ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.
Similar News
News February 24, 2026
ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
కృష్ణా డెల్టాకు 195 టీఎంసీలు కావాల్సిందే.. ఏపీ వాదన

AP: కృష్టా డెల్టాలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలంటూ TG ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ఖండించింది. ‘కృష్ణా డెల్టాలో పంట కాలాన్ని 180 రోజులుగా KWDT-1 నిర్ధారించింది. ఇందుకు 195 టీఎంసీల నీరు అవసరం. అయితే తెలంగాణ ప్రతినిధి పంట కాలాన్ని 122 రోజులుగా చెబుతూ 130 టీఎంసీలే సరిపోతాయని చెప్పడం అశాస్త్రీయం’ అని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ న్యాయవాది జైదీప్ వాదనలు వినిపించారు.
News February 24, 2026
యాభై ఏళ్ల ప్రస్థానం.. ముగిసినట్లేనా?

ADB, KNR జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గింది. అగ్రనేత దేవ్ జీ లొంగుబాటు వార్తలతో KNR జిల్లాలో ముప్పాల లక్ష్మణరావుతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడే మిగిలినట్లు తెలుస్తోంది. 2000 నుంచి 2026, ఫిబ్రవరి 21 వరకు మావోయిస్టుల పోరులో మొత్తం 12,170 మంది మృతి చెందారు. వీరిలో 5,057 మంది మావోయిస్టులు, 2,007 మంది భద్రతా సిబ్బంది, 4,138 మంది పౌరులున్నారు. మూడేళ్లలో 793 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారు.


