News July 17, 2024
పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3 వేల ఎకరాలను కబ్జా చేసింది: మంత్రి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.
Similar News
News October 25, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 25, 2025
రాజుపాలెం: కుందూనదిలో దంపతుల ఆత్మహత్యాయత్నం?

రాజుపాలెం మండలంలోని వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యాభర్తలు గొంగటి రామసుబ్బారెడ్డి, నాగ మునెమ్మ పడ్డారు. గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న భర్తను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నాగ మునెమ్మ గల్లంతయారు. ఆమె కోసం గజఈత గాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వీరు పెద్దముడియం మండలంలోని ఉప్పులూరుకు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 25, 2025
కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.


