News August 2, 2024
పెద్దిరెడ్డి భయపెట్టినా నన్ను గెలిపించారు: ఆదిమూలం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రూ.కోట్ల విలువైన మద్యం, డబ్బు ఎన్నికల్లో పంచి నన్ను ఓడించాలనుకున్నారు. భయపెట్టినా సరే ప్రజలు నన్ను గెలిపించారు. ఆయన పుంగనూరులో గెలిచినా అక్కడ ప్రజల్లో తిరగలేకుండా ఉన్నారు. ఇదంతా కర్మ ఫలం’ అని బీఎన్ కండ్రిగలో జరిగిన పింఛన్ల పంపిణీలో ఆదిమూలం ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News November 27, 2025
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
భూపతి మృతిపట్ల CM చంద్రబాబు విచారం

రామకుప్పం(M) వీర్నమలకు చెందిన వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి పట్ల CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భూపతి విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమని, వార్డు మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమన్నారు. భూపతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని CM అన్నారు.
News November 26, 2025
చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.


