News July 31, 2024

పెద్దిరెడ్డి 20వేల ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి

image

రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామచంద్రారెడ్డి, ఆయన ముఠా దాదాపు 20 వేల ఎకరాలు కబ్జా చేశారని, వాటి విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనిని తప్పించుకోవడానికే మదనపల్లె ఆర్డీవో కార్యలయంలో 22A ఫైళ్లు దగ్ధం చేశారన్నారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయన్నారు. అంతే కాకుండా పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ చేపడతామన్నారు.

Similar News

News January 8, 2026

పుంగనూరు: 2042 వరకు అనుమతులు ఉన్నా.?

image

సదుంలో క్వారీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐతేశ్వర్ణ్‌కు 2022 OCT 21న క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి. సర్వే నంబర్‌ 270/2లోని సుమారు 4 హెక్టార్ల విస్తీర్ణంలో రంగు గ్రానైట్‌ రాళ్ల తవ్వకాలను ప్రారంభించారు. ఈ క్వారీకి 2042 OCT 20 వరకు అనుమతులు ఉన్నాయి. గ్రామస్థులు, క్వారీ యజమానులు మధ్య పంచాయితీ PS వరకు వెళ్లింది. గ్రామస్థులు కావాలనే అడ్డుకుంటున్నారనే వివాదం నడుస్తోంది.

News January 8, 2026

చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

image

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.

News January 7, 2026

క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.