News March 28, 2025
పెనగలూరు: అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు

పెనగలూరు మండలం, ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ల మహేశ్వరయ్యను ఇనుప రాడ్డుతో తలపై మోది చంపిన తమ్ముడు బుర్రకట్ల ఈశ్వరయ్య చంపాడు. ఈకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరం జనవరి నెలలో నేరం చేసిన ముద్దాయికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది. కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

ఆన్లైన్ బెట్టింగ్ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <
News April 18, 2025
ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.