News January 28, 2025

పెనమలూరులో మృతదేహం కలకలం

image

పెనమలూరులో మృతదేహం కలకలం రేపింది. పెనమలూరు ఎస్సై ఉషారాణి.. తెలిపిన సమాచారం ప్రకారం తాడిగడప కాలువ గట్టు వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అక్కడ 35 నుంచి 40 సంవత్సరాల మగ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. మృతుడి వంటిపై నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు.

Similar News

News February 15, 2025

వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

image

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై ఏర్పాటు చేశారు.

News February 15, 2025

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భువనగిరి కలెక్టర్ 

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

News February 15, 2025

మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

image

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్‌లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.

error: Content is protected !!