News January 24, 2025

పెనమలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్‌కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.

Similar News

News February 15, 2025

పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News February 15, 2025

గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

News February 14, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

image

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు. 

error: Content is protected !!