News October 4, 2024

పెనుకొండలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మార్కెట్ యార్డు వద్ద ఉరివేసుకుని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రఫీక్(67) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గోరంట్ల మండలంలో ఓ భూ వివాదామే తమ తండ్రి మృతికి కారణమని మృతుడి కుమారులు రియాఫత్, హిదయాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు.

Similar News

News October 5, 2024

అనంత జిల్లా విజన్ ప్లాన్ తయారీపై సమావేశం

image

స్వర్ణాంద్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ తయారీపై అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగం అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ దర్శకుడి పర్యటన

image

మడకశిర నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ముఖ్య దేవాలయాలను సినీ దర్శకుడు ధనరాజ్ శుక్రవారం సందర్శించారు. హేమావతిలోని ఎంజీఆర్ సిద్దేశ్వరస్వామి టెంపుల్, రోళ్ళలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, రత్నగిరి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం, చెందకచర్ల ఆంజనేయస్వామి టెంపుల్, మడకశిరలోని పూజమ్మ, శివాలయం, తదితర ఆలయాలను సందర్శించి ధూప, దీప నైవేద్యాలను కానుకగా సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరారు.

News October 4, 2024

రాజకీయాలంటే ప్రజలలో ఒక చులకన భావన: కేతిరెడ్డి

image

రాజకీయాలు అంటే ఇప్పటికే ప్రజల్లో ఒక చులకన భావంతో చూస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి యొక్క కుటుంబ విషయాలను, వ్యక్తిగత విచారణ వాడుకోవడం ఒక నీచమైన చర్య అంటూ Xలో పోస్ట్ చేశారు.