News March 25, 2025
పెనుగంచిప్రోలు: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన్ కుమార్ కథనం మేరకు.. బత్తుల గోపి సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేయడానికొచ్చాడు. కాగా మద్యం తాగడం కోసం తన భార్యను రూ.200 అడగగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. గోపి మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News October 25, 2025
డ్రైవర్ బస్సును అక్కడే ఆపుంటే..

వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై బైక్ను ఢీకొన్న వెంటనే ఆగి ఉంటే పెను ఘోరం జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు అతివేగంగా వెళ్తున్న బస్సు కర్నూలు శివారులో ముందు వెళ్తున్న బైక్ను ఢీకొంది. ద్విచక్రవాహనదారుడు శివశంకర్ (24) మృతిచెందాడు. బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ను కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ ట్యాంకు మూత ఊడి మంటలు చెలరేగాయన్న చర్చ జరుగుతోంది.
News October 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 46

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరేంటి?
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ఏది?
3. నాగుల చవితి ఏ మాసంలో వస్తుంది?
4. ఇంద్రుడికి గురువు ఎవరు?
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ఎవరు?
✍️ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 25, 2025
BEL మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 38 ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్-C పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంటర్+ITI అర్హతగల అభ్యర్థులు NOV16 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మహారాష్ట్ర స్టేట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: bel-india.in/


