News March 25, 2025

పెనుగంచిప్రోలు: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

image

పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన్ కుమార్ కథనం మేరకు.. బత్తుల గోపి సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేయడానికొచ్చాడు. కాగా మద్యం తాగడం కోసం తన భార్యను రూ.200 అడగగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. గోపి మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

Similar News

News November 18, 2025

మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

image

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

News November 18, 2025

మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

image

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

News November 18, 2025

ములుగు: హిడ్మా దళంలో ఆరుగురేనా..?

image

పోలీస్ బలగాలను ముప్పతిప్పలు పెట్టిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హిడ్మా పేరు తెలియని వాళ్లు లేరు. అయితే మోస్ట్ వాంటెడ్, రూ. కోటి రివార్డుతో పాటు, సీసీ కమిటీ మెంబర్‌గా ఉన్న హిడ్మా మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న హిడ్మా దళంలో కేవలం ఆరుగురు ఉండడం గమనార్హం.