News June 6, 2024

పెనుగంచిప్రోలు: యువకుడి అనుమానాస్పద మృతి.?

image

పెనుగంచిప్రోలుకు చెందిన కార్తీక్, వత్సవాయి మం.వేమవరానికి చెందిన నాగరాజు మధ్య NTR స్టిక్కర్ తొలగించే విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కార్తీక్‌తో బలవంతంగా బైకుపై ఉన్న స్టిక్కర్ తీయించిన నాగరాజు, వీడియో కూడా తీసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపై కొద్దిసేపటికే వేమవరం సమీపంలో అనుమానాస్పదరీతిలో కార్తీక్ డెడ్‌బాడీ కనిపించిందని, వత్సవాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Similar News

News October 23, 2025

కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.

News October 23, 2025

ఉయ్యూరు: అత్యాచార నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

image

ఉయ్యూరులో రెండు రోజుల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు చాంద్ బాషాను పోలీసులు గురువారం నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచే నిమిత్తం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు సంకెళ్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిని రోడ్డుపై తీసుకెళ్తుంటే జనాలు బారులు తీరి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించారు.

News October 23, 2025

కృష్ణా: భారీ వర్షాలు.. రైతు కంట నీరు

image

రైతులకు ఈ సార్వా పంట మొదలు పెట్టినప్పటి నుంచీ కష్టాలే ఎదురవుతున్నాయి. వరి నారుమడి సమయంలో వర్షాలకు నారు పాడై, నారు దొరకని పరిస్థితి. ఆ తర్వాత యూరియా కొరత, ఎరువులు అందక సుదూర ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో డబ్బు చెల్లించి మరీ వాడారు. పంటకు పెట్టాల్సిన పెట్టుబడి అంతా అయిపోయిందనుకున్న సమయంలో, ఈ తుఫాను వల్ల పొలాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో కళ్లముందే పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.