News June 11, 2024

పెనుగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. పోడూరు మండలం జిన్నూరుకు చెందిన వెంకటపతి(75) కత్తి పీటల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం వ్యాపారం నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. పెరవలి నుంచి రావుపాలెం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్‌లో తణుకు ఆసుపత్రికి తరలించగా వెంకటపతి అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 8, 2026

ప.గో: యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.