News December 25, 2024

పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శివారు పంపన వారి పాలెం పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుమంట్ర గ్రామానికి చెందిన గుబ్బల వెంకటేశ్వరరావు మృతి చెందాడు. వెంకటేశ్వరరావు మోటార్ సైకిల్‌పై పెనుమంట్ర వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 23, 2025

ప.గో: గుడ్ న్యూస్ చెప్పిన జేసీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News December 23, 2025

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ పెయిర్లు: కలెక్టర్

image

విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. వీరవాసరం జడ్పీ హైస్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రారంభించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 146 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News December 23, 2025

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ పెయిర్లు: కలెక్టర్

image

విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, దేశ పురోభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. వీరవాసరం జడ్పీ హైస్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి ప్రారంభించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 146 సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు.