News September 29, 2024
పెనుమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రేపల్లె మండలం పెనుముడి వారధి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ లో ఉన్న పదిమందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలుకాగా క్షతగాత్రులను రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 26, 2026
సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
News February 26, 2026
డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
News February 26, 2026
GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్లో పోస్టర్ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.


