News August 2, 2024
పెన్షన్ పంపిణీలో చిత్తూరుకు 7, తిరుపతికి 8వ స్థానం

రాష్ట్రవ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు 7వ స్థానం, తిరుపతి జిల్లాకు 8వ స్థానం లభించినట్లు జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 270619 మంది ఉండగా 264268 మందికి పెన్షన్ పంపిణీ జరిగినట్లు తెలిపారు. 97.67 శాతం పంపిణీతో 7వ స్థానంలో చిత్తూరు జిల్లా ఉన్నట్లు తెలిపారు. 267772 మందికిగాను 261291 పంపిణీ చేసి 97.58 శాతంతో 8వ స్థానంలో తిరుపతి జిల్లా ఉన్నట్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదు.
News November 24, 2025
చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.!

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం(M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ(22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి(M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


