News July 1, 2024
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.
Similar News
News September 21, 2024
VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’
ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
News September 20, 2024
VZM: గురజాడ జయంతికి సర్వం సిద్ధం
విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
News September 20, 2024
విశాఖ-దుర్గ్ వందేభారత్ ఛార్జీలు ఇవే
కొత్తగా ప్రారంభమైన విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ఛార్జీలు గుండె గుబేల్ మంటున్నాయి. శుక్రవారం నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరుగుతోంది. విజయనగరం నుంచి రాయగడ ఛైర్ కార్ ధర రూ.535, పార్వతీపురానికి రూ.490గా ధర ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ ధర అయితే దీనికి రెట్టింపు ఉంది. ఇదే ఎక్స్ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్ విజయనగరం నుంచి పార్వతీపురం ధర కేవలం రూ.145 మాత్రమే. వందే భారత్ ధరలు చూసి ప్రయాణీకులు హడలిపోతున్నారు.