News December 31, 2024

పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ లక్ష్మిశ 

image

పేద‌లకు సామాజిక భద్రత కల్పించి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో అధికారుల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో ఒక‌రోజు ముందుగానే పెన్ష‌న్ల పంపిణీ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. పేద‌ల‌కు జ‌వాబు దారీత‌నంతో పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం జరుగుతుందన్నారు. 

Similar News

News September 16, 2025

బందరు: జగన్ ఫోటోతో INCOME సర్టిఫికేట్ జారీ

image

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.

News September 16, 2025

దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

image

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్‌లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు