News March 21, 2025

పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ

image

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 1, 2025

రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

image

తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం విచారణ జరిపారు. 6 నెలల్లో తన పదవి కాలం పూర్తవుతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని ఛైర్మన్ సూచించడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. YCP త‌ర‌ఫున MLC గా ఎన్నికైన ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

News December 1, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష
➤ PGRS లో ఫిర్యాదులు వెల్లువ
➤ పింఛన్లు పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
➤ గృహ,ఇంటి స్థలం దరఖాస్తుకు గడువు పెరిగింది: బత్తుల తాతయ్యబాబు
➤ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలు
➤ రాజాంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
➤ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
➤డి.యర్రవరంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన స్పీకర్

News December 1, 2025

NGKL: ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 2, 3 తేదీలలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం, పత్తి తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కోత కోసి కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.