News February 21, 2025
పెబ్బేరు: అత్యాచారయత్నం కేసు.. నిందితుడికి రిమాండ్

పెబ్బేరు పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మహిళను పెబ్బేరుకు చెందిన ఎరుకలి రాముడు బలవంతంగా చెలిమిల్ల రామాలయం వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ కేసులో ఎరుకలి రాముడుకు వనపర్తి JFCM న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని పెబ్బేరు పోలీసులు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు స్థానిక ఎస్హెచ్ఓ హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 21, 2025
HYD: GOVT ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠినచర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
News November 21, 2025
గజపతినగరం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు మానసిక స్థితి బాగోలేనందున ఈనెల 19న పురుగులు మందు తాగినట్లు భార్య సత్యవతి తెలిపారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


