News April 16, 2025

పెబ్బేరు: GREAT.. మరణించిన ఫ్రెండ్ కుటుంబానికి సాయం 

image

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో 2009లో తమతో చదివిన 10వ తరగతి చిన్ననాటి మిత్రుడు రాజశేఖర్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విషయం తెలిసి చలించిపోయిన తోటి స్నేహితులంతా కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి మంగళవారం రూ.80,000 జమ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. వారిని స్థానికులు అభినందించారు. కష్టకాలంలో తోడుగా నిలిచే వారే నిజమైన స్నేహితులని తెలిపారు. 

Similar News

News November 28, 2025

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

image

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

News November 28, 2025

పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

image

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.

News November 28, 2025

SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.