News February 14, 2025

పెరిగిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురువారం నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.39,00,400 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News October 22, 2025

పల్నాడు: ఖరీఫ్ అనుభవాలతో రబీ పంటకు ప్రణాళికలు

image

ఖరీఫ్ పంటలో చోటు చేసుకున్న అనుభవాలతో రబీ పంటకు ఇబ్బందు లేకుండా పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పల్నాడు జిల్లాలో పంటల విస్తీర్ణాన్ని గుర్తించి ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేస్తారో అంచనా వేస్తుంది. ఖరీఫ్‌లో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో రబీ పంటకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

News October 22, 2025

రేపే మ్యాచ్.. 17 ఏళ్ల రికార్డ్ కాపాడుకుంటారా?

image

IND, AUS మధ్య రెండో వన్డే రేపు అడిలైడ్ ఓవల్ గ్రౌండ్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్‌ఇండియా సెకండ్ ODIలో గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని చూస్తోంది. కాగా అడిలైడ్‌లో 15 వన్డేలు ఆడిన IND 9 మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడ గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ రాణిస్తే రేపు భారత్‌కు తిరుగుండదు. మరి ఈ రికార్డును కాపాడుకుంటుందా? లేదా AUS బ్రేక్ చేస్తుందా? COMMENT

News October 22, 2025

VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

image

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.