News May 18, 2024
పెళ్లకూరు: కారు ఢీకొని వ్యక్తి మృతి

పెళ్లకూరు మండలం చెంబడిపాలెం 71వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరులోని వేంకటేశ్వర భగత్ సింగ్ కాలనీకి చెందిన అలీ షేర్ రోడ్డు మీద నడిచి వెళుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొంది. ఘటనలో అలీ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లకూరు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 28, 2026
నెల్లూరు జిల్లాలో ప్రిన్సిపల్ సూసైడ్

చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బి.సునీల్(38) పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయలేదు. బంధువులు ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతకగా.. మడమనూరు సమీపంలో విషం తాగి పడిపోయినట్లు గుర్తించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చనిపోయారు. అప్పులు, వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
News February 28, 2026
శ్రీసిటీలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

శ్రీసిటీకి మరో భారీ పరిశ్రమ రానుంది. జపాన్కు చెందిన ప్రొటీరియల్ లిమిటెడ్ సంస్థ రూ.700కోట్లతో ఎలక్ట్రికల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి బొగ్గుతో కాకుండా మొత్తం విద్యుత్తు ద్వారా ఎల్లాయ్ రిబ్బన్ను ఉత్పత్తి చేయనుంది. రెండో దశలో మరో రూ.700కోట్లు పెట్టనుంది. ముందుగా 200 మందికి.. తర్వాత 500మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ ఏడాది చివరిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.
News February 28, 2026
అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.


