News December 2, 2024

పెళ్లి ఇష్టం లేక యువకుడి సూసైడ్..

image

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు <<14758454>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> గ్రామానికి చెందిన వేణుకుమార్ రెడ్డి(29)కి ఇటీవలే నిశ్చితార్థం కాగా శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఇష్టం లేకనే చనిపోతున్నానని వేణు అతని అన్న ప్రవీణ్‌కు వాయిస్ మేసేజ్ పంపాడు. అతను స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లేలోపే సూసైడ్ చేసుకున్నాడు.

Similar News

News February 10, 2026

ఇందిరమ్మ ఇళ్లు వెంటనే పూర్తి చేయాలి: గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ

image

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల అప్పగింతకు ముందే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలు 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.

News February 10, 2026

మున్సిపల్‌ సమరానికి సర్వం సిద్ధం: నల్గొండ కలెక్టర్‌

image

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈనెల 11న జరిగే ఎన్నికల సరళిపై మంగళవారం ఆయన ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 473 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News February 10, 2026

NLG: లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యం: వీపీ గౌతమ్

image

చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ బీ.చంద్రశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, సర్పంచ్ కాటం వెంకటేశం, తదితర అధికారులు పాల్గొన్నారు.