News January 26, 2025
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని అనుమానంతో వట్టివల్ల రజిత(20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డోన్ మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మన్న తన కూతురుకు పెళ్లి చేయాలని ఇటీవల సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఇష్టం లేని రజిత శనివారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 19, 2025
గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News November 19, 2025
నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.
News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


