News March 3, 2025

పేకాట స్థావరంపై దాడి.. 17 మంది అరెస్టు

image

హిందూపురం మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో సీఐ చంద్ర ఆంజనేయులు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 10 బైకులు, రూ.81 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటను అశ్వత్థప్ప అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Similar News

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.

News February 25, 2026

డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

image

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

News February 25, 2026

నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయనున్న ప్రభాస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ప్రభాస్ స్వయంగా స్పందించి ఆ సంస్థకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించుకుంటానని చెప్పారట. స్పిరిట్, ఫౌజీ చిత్రాలు పూర్తయ్యాక 2027లో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.