News March 17, 2025

పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

image

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 14, 2025

అనధికార MIHM ఫంక్షన్ హాల్ సీజ్

image

హై కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని కోటమిట్టలో ఉన్న అన్నధికారికంగా చేపట్టిన MIHM ఫంక్షన్ హాల్‌ను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. దీని తరువాత కార్యాచరణ నిమిత్తం దీన్ని ఫంక్షన్ హాల్ యాజమాన్యం సమక్షంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ సిబ్బంది సీజ్ చేయడం చేశారు.

News October 14, 2025

“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

image

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.