News March 1, 2025

పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యం: కలెక్టర్

image

ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.

Similar News

News February 23, 2026

కామారెడ్డి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాధ్యతలు స్వీకరణ

image

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.రవీందర్ గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయణ్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(I/C)గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇటీవల నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించి, పలువురు అధికారులతో జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సేవలపై చర్చించారు. PH&MEU జిల్లా కమిటీ అభినందించారు.

News February 23, 2026

ఆదిలాబాద్: జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా పాలిటెక్నిక్

image

పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రచారం ప్రారంభించిందని ADB సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు POLYCETపై అవగాహన కల్పించామన్నారు. ఈ సంవత్సరంకొత్త కోర్సులు అందుబాటులో వచ్చాయన్నారు.

News February 23, 2026

అమెజాన్.. బెంగళూరులో 2వ అతిపెద్ద క్యాంపస్

image

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ బెంగళూరులో ఆసియాలోనే 2వ అతిపెద్ద ఆఫీసును స్టార్ట్ చేసింది. ఐదెకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్‌ను కర్ణాటక మంత్రి MB పాటిల్‌ ప్రారంభించారు. ఇందులో 7,000 మంది పని చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. అమెజాన్ భారత్‌లో ఇప్పటికే 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టగా, 2030 నాటికి అదనంగా మరో 35 బిలియన్ డాలర్లను యాడ్ చేయనున్నట్లు తెలిపింది. అతిపెద్ద క్యాంపస్ HYDలో ఉంది.