News March 6, 2025

పేద‌రికం లేని స‌మాజం ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే: కలెక్టర్

image

పేద‌రికం లేని స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ద్వారా స‌ర్వే జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్‌గా పీ4 స‌ర్వేపై స‌మావేశం నిర్వహించారు.

Similar News

News December 5, 2025

మహబూబ్‌నగర్: వేలం పాటతో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: అరుణ

image

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎంపీ డి.కె.అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని సర్పంచ్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవం మంచిదే అయినా, డబ్బులతో కాకుండా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

News December 5, 2025

13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

image

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్‌‌తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.

News December 5, 2025

పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

image

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.