News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.
Similar News
News November 14, 2025
భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్(DIO) 7 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, B.Tech, BE, MSc, ME, M.Tech, MBA/PGDM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ ప్రోగ్రామ్ డైరెక్టర్కు నెలకు రూ.1,40,000-1,80,000, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కు రూ.80,000-రూ.1,20,000, DPEకు రూ.40,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్సైట్: idex.gov.in/
News November 14, 2025
‘మల్లె’ తోటల్లో కొమ్మల కత్తిరింపుతో లాభమేంటి?

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల మొక్క ఆరోగ్యం మెరుగుపడి, కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం, నాణ్యత, పువ్వుల దిగుబడి కూడా పెరుగుతుంది. చనిపోయిన, బలహీనమైన, అనారోగ్యకరమైన కొమ్మలను తొలగించడం వల్ల మొక్క మిగిలిన భాగాలకు శక్తి, పోషకాలు అంది మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి కొమ్మను నేల నుంచి 6-12 అంగుళాల ఎత్తులో కత్తిరించాలి. ప్రతి సీజన్లో 25-30% కొమ్మలను మాత్రమే తొలగించాలి.
News November 14, 2025
జూబ్లీహిల్స్లో బీసీ నినాదం పనిచేసిందా..?

జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ విజయానికి బీసీ నినాదం కూడా ప్రధానంగా పనిచేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత కమ్మ వర్గానికి చెందిన మహిళ కావడం, BJP అభ్యర్థి లంకల దీపక్.. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం నవీన్ యాదవ్కు కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లతో పాటు మిగితా బీసీ ఓటర్లు నవీన్కే జై కొట్టారు. దీంతో భారీ మెజార్టీతో గెలిచారని వారు అంటున్నారు.


