News March 23, 2025
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం: నంద్యాల కలెక్టర్

పేదరికాన్ని నిర్మూలించడమే పీ-4 (ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల-భాగస్వామ్య) వ్యవస్థ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ4 విధానంపై చర్చ, అభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 17, 2025
ఉపమాక బాలికను అభినందించిన గవర్నర్, మంత్రి

సూపర్ జీఎస్టీ 2.0 చిత్రలేఖనం పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉపమాకకు చెందిన బాలిక కే.చైత్రిని గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ ప్రశంసలు పొందింది. నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కె.చైత్రిని సూపర్ జీఎస్టి 2.0 చిత్రలేఖనం పోటీల్లో మండల స్థాయి, జిల్లాస్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ బాలికను గురువారం కర్నూలులో గవర్నర్, మంత్రి అభినందించినట్టు హెచ్ఎం శ్రీలక్ష్మి చెప్పారు.
News October 17, 2025
బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుంది: MP కావ్య

కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. HNK కాంగ్రెస్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఏకతాటికి తీసుకొచ్చి అందరితో కలిసిపోయే పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో బీజేపీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు.
News October 17, 2025
నిర్మల్: ఇవాళ ఒక్కరోజే 160 దరఖాస్తులు

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తులు జోరుగా సాగుతున్నాయని జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. శనివారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడవు ముగుస్తుందన్నారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే 160 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తులలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.