News March 23, 2025
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం: నంద్యాల కలెక్టర్

పేదరికాన్ని నిర్మూలించడమే పీ-4 (ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల-భాగస్వామ్య) వ్యవస్థ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ4 విధానంపై చర్చ, అభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.
News November 20, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకుకు కొడవండ్లపల్లి విద్యార్థి ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ముదిగుబ్బ(M) కొడవండ్లపల్లి హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ప్రవల్లిక అండర్-17 ఖోఖోలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. HM డాక్టర్ రాశినేని రామానాయుడు, PET శాంతలింగం, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. ఈనెల 23 నుంచి విజయనగరంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రవల్లిక మరింత ప్రతిభ చూపించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
News November 20, 2025
కొత్త సినిమాల కబుర్లు

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.


