News March 23, 2025

పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

పేదరికాన్ని నిర్మూలించడమే పీ-4 (ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల-భాగస్వామ్య) వ్యవస్థ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్‌లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ4 విధానంపై చర్చ, అభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 24, 2025

ALL SET: 8.54amకు నింగిలోకి..

image

AP: LVM3-M6 రాకెట్‌ ప్రయోగానికి తిరుపతి(D) శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. 8:54amకు USకు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లో‌ఎర్త్ ఆర్బిట్‌(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.

News December 24, 2025

ధనుర్మాసం: తొమ్మిదో రోజు కీర్తన

image

గోదాదేవి సంపదలు గల కన్యను నిద్రలేపుతోంది. రత్నాల మేడలో, హంసతూలికా తల్పంపై నిద్రిస్తున్న తన మేనమామ కూతురితో ‘భగవంతుని నామాలు ఇంతలా స్మరిస్తున్నా నీకు వినబడడం లేదా? గడియ తీయవేమ్మా!’ అని అంటోంది. తన కూతురింకా లేవకపోవడంతో ‘మేనత్తా! నీవైనా లేపు. తను మూగదా? చెవిటిదా? లేక మంత్రం వేసినట్టు ఎందుకు నిద్రపోతోంది?’ అని సరదాగా నిలదీస్తుంది. భగవదనుభవం కోసం అందరూ కలిసి రావాలని ఈ పాశురం చెబుతుంది. <<-se>>#DHANRUMASAM<<>>

News December 24, 2025

ముస్లింలపై దారుణాల గురించి రాయాలని ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

image

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రొఫెసర్ అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ప్రొ.వీరేంద్ర బాలాజీ ‘INDలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి’ అని BA సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న అడిగారు. ప్రశ్నాపత్రం SMలో వైరల్ కాగా ఇది రాజకీయ, మతపరమైన పక్షపాతంతో రూపొందించిన ప్రశ్న అని వర్సిటీకి ఫిర్యాదులందాయి. కమిటీని ఏర్పాటు చేసిన వర్సిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేసింది.