News March 13, 2025
పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
Similar News
News November 19, 2025
నల్గొండ: నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోలు షురూ

జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బందును విరమించాయి. సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిన్నింగ్ మిల్లులు మంగళవారం బంద్ పాటించాయి. దీంతో రంగంలోకి దిగిన సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులను 2, 3 రోజుల్లో తెరుస్తామని హామీ ఇవ్వడంతో మిల్లుల యజమానులు బంద్ ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు చేయనున్నారు.
News November 19, 2025
NLG: పత్తి కొనుగోళ్లు నత్తనడకే!..

ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 7.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయినట్లు అంచనా. ఇందులో నుంచి సాధారణంగా అయితే 95 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 98,492 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, కపాస్ కిసాన్ యాప్తో పాటు సీసీఐ నిబంధనలు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.
News November 19, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.


